
రామమందిర్ట్రస్ట్ కు తొలి గా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా...ఆయనబ్యాక్గ్రౌండ్ ఇదే
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Ram Mandir CEO: అయోధ్య రామమందిర్ ట్రస్టు బోర్డులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత వైమానిక దళంలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సేవలందించిన రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పశ్చిమ వైమానిక కమాండ్కు నాయకత్వం వహించిన అధికారిగా ఆయన పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలట్గా భారత వైమానిక దళంలో చేరిన జితేంద్ర మిశ్రా.. తన సుదీర్ఘ కెరీర్లో 3,000 గంటలకు పైగా విమానాలు నడిపారు. ఫైటర్ కంబాట్ లీడర్గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్గా సేవలందించారు. బెంగళూరులోని ఎయిర్క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో చీఫ్ టెస్ట్ పైలట్గా పనిచేశారు. ఫైటర్ స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్గా, రెండు కీలక వైమానిక స్థావరాలకు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్గా బాధ్యతలు నిర్వహించారు. ఎయిర్ హెడ్క్వార్టర్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లోనూ కీలక పదవుల్లో పనిచేశారు. అమెరికాలోని ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, బ్రిటన్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో ఉన్నత స్థాయి రక్షణ శిక్షణ పొందారు. 2025 జనవరి 1న వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్తో సరిహద్దు ప్రాంతాల్లో వైమానిక కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక వసతులపై దాడులు నిర్వహించింది. పాకిస్థాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. దాదాపు నాలుగు